గుండుతో దర్శనమిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌.. షాక్ తిన్న అభిమానులు

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో మహేశ్ రొమాన్స్ చేశారు. వారిలో ఒకరు బిపాసా బసు, మరొకరు లిసారాయ్. ఈ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. కౌబాయ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన సినిమా ఇది.

లిసారాయ్
లిసారాయ్

మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా టక్కరి దొంగ. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ లీసా రాయ్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

టక్కరి దొంగ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.. కానీ బాలీవుడ్‌లో లీసా రాయ్ పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు బుల్లితెర షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లీసా రాయ్ ఇటీవల గుండుతో కనిపించి అందరినీ షాకు గురి చేసింది.

- Advertisement -

ఆమె లుక్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వారిలో కొందరు హీరోయిన్ లీసా రాయ్‌ని గుర్తుపట్టలేకపోతున్నారు. అయితే లీసా రాయ్ గుండుతో కనిపించి గొప్ప సాహసమే చేసింది. అమ్మడు దేని కోసి గుండు చేయించుకుందని సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here