‘విరూపాక్ష’ డైరెక్టర్ కి కోట్ల రూపాయిలు విలువ చేసే కార్ ని బహుమతి గా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్

- Advertisement -

ఈ ఏడాది సమ్మర్ లో నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించిన అతి తక్కువ సినిమాలలో ఒకటి సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ అనే చిత్రం. చాలా కాలం తర్వాత థియేటర్స్ లో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన హారర్ సినిమాని చూసిన అనుభూతి ఇచ్చినందుకు ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ కి ఒక మర్చిపోలేని జ్ఞాపకం. ఇక సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు కి కూడా టాలీవుడ్ లో మామూలు క్రేజ్ లేదు. సుకుమార్ స్కూల్ నుండి ఇప్పటికే బుచ్చి బాబు మరియు శ్రీకాంత్ ఓడేలా వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఇప్పుడు వారి జాబితాలోకి కార్తీక్ దండు కూడా చేరిపోయాడు.

ఇది ఇలా ఉండగా తనకి అద్భుతమైన పాత్ర ని ఇచ్చినందుకు గాను హీరోయిన్ సంయుక్త మీనన్ సినిమా విడుదలైన కొత్తల్లోనే ఐ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ మొబైల్ ని కొని, కార్తీక్ కి బహుమతిగా ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్, నిర్మాత BVSN ప్రసాద్ మరియు హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి మెరిడాస్ బెంజ్ కార్ ని బహుమతి గా ఇచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు కార్తీక్. ఇంత విలువైన కార్ ని బహుమతి గా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ‘విరూపాక్ష’ చిత్రం నాకు ఒక మరచిపోలేని జ్ఞాపకం, నన్ను డైరెక్టర్ గా పెట్టి సినిమా తీసేంత నమ్మకం ఉంచిన సాయి ధరమ్ తేజ్ మరియు నిర్మాత కి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఆయన వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇక పోతే ఈ కార్ విలువ దాదాపుగా రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here