Vijay Deverakonda : VD12 పెండింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన‌ అర్జున్ రెడ్డి

- Advertisement -

Vijay Deverakonda : యూత్‌లో క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఘాటు క్యారెక్టర్‌లో తనదైన ప్రత్యేకతతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు అర్జున్ రెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. విజయ్ నటించిన గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Vijay Deverakonda

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా విజయ్ తన డబ్బింగ్ కూడా చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించనుంది చిత్ర బృందం. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ గతంలో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. గతంలో విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా మొదలుపెట్టాడు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే సరికి ఈ సినిమా ఆగిపోయింది.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మార్చి నెలాఖరులో విజయ్ ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శ్రీలంకలో జరగనుంది. 2024లో విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ మొట్టా తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

- Advertisement -

విజయ్ ఫ్యామిలీ స్టార్ చేస్తున్న సమయంలో గౌతమ్ చిన్న సినిమా చేశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం మ్యాజిక్. ఈ యూత్ ఫుల్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ పూర్తి చేసి ఈ వారంలోనే గౌతమ్ తిననూరి ఫ్రీ అవుతాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా రూమర్స్ వచ్చాయి. నిజానికి సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల VD12 పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే డేట్స్ గొడవ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాత్ర కోసం ‘యానిమల్’తో లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిప్తి దిమ్రీని నిర్మాతలు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘సప్తసముద్రాలు దాటి’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here