Actor Ajith : ఆస్పత్రిలో చేరిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. వేలాదిగా తరలివస్తున్న ఫ్యాన్స్

- Advertisement -


Actor Ajith : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతుంటాయి. ఇక్కడ కూడా భారీ హిట్స్ అందుకుంటాయి. అజిత్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే అజిత్ హాస్పిట‌ల్‌లో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిట‌ల్‌లో గురువారం అజిత్ చేరిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. అజిత్ హాస్పిట‌ల్ పాల‌వ్వ‌డంతో అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అజిత్‌కు ఏమైందోన‌ని ఫ్యాన్స్‌ కంగారు ప‌డుతోన్నారు. వేలాదిగా ఆస్పత్రికి తరలి వస్తున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Actor Ajith

ఇది ఇలా ఉంటే రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్ కోస‌మే అజిత్ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. డాక్ట‌ర్ల చెక‌ప్‌లో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు వెల్ల‌డైంద‌ని చెబుతున్నారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు అజిత్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన‌ట్లు చెబుతోన్నారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో అజిత్ డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అజిత్ అనారోగ్య స‌మ‌స్య‌లంటూ జ‌రుగుతున్న ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండించారు. అజిత్ త‌న నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం త్వ‌ర‌లోనే విదేశాల‌కు వెళ్ల‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన మెడిక‌ల్ ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేయ‌డానికే అజిత్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ ఫార్మాలిటీస్ పూర్త‌యిన వెంట‌నే అజిత్ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అవుతార‌ని అంటున్నారు. ఈ పుకార్ల‌ను అభిమానులు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న టీమ్ తెలిపింది.

ajith

అజిత్ ప్ర‌స్తుతం విదా ముయార్చి సినిమా చేస్తోన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి మాగిజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. దాదాపు 60 కోట్ల‌కు ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. విదా ముయార్చిలో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. అజిత్‌, త్రిష కోలీవుడ్‌లో సూప‌ర్ హిట్ కాంబోగా పేరుతెచ్చుకున్నారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సినిమాలొచ్చాయి. చివ‌ర‌గా అజిత్, త్రిష క‌లిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here