Chiranjeevi పాట కారణంగా పిచ్చి పట్టి 8 ఏళ్ళు రోడ్డు పాలైన నటుడు అతనేనా..?

- Advertisement -

మెగాస్టార్ Chiranjeevi కి అత్యధిక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ తీస్తే అందులో కోదండరామి రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుంది. చిరంజీవి తో ఆయన ఏకంగా 23 సినిమాలు తీసాడు. ఆ 23 సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘న్యాయం కావలి’. చిరంజీవి ని నెగటివ్ షేడ్స్ లో చూపించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్.

Chiranjeevi
Chiranjeevi

ఈ సినిమా తర్వాత కొన్నాళ్ళకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఖైదీ’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. అప్పటి వరకు మామూలు హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటూ వస్తున్న చిరంజీవి, ఈ సినిమాతో వేరే లెవెల్ కి చేరుకున్నాడు. ఇక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మెగాస్టార్ గా నెంబర్ 1 గా దశాబ్దాలు ఇండస్ట్రీ లో కొనసాగడానికి పునాది వేసింది ఈ ‘ఖైదీ’ చిత్రం.

Kodanda ramireddy

అయితే ఈ సినిమా లో ‘రగులుతుంది మొగలిపొగ’ అనే పాట అప్పట్లో యువతరాన్ని ఏ రేంజ్ ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా రొమాంటిక్ సాంగ్స్ టాప్ 10 బెస్ట్ సాంగ్స్ తీస్తే ఈ పాట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ పాటలో రొమాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, దీని వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదురుకోలేదా అప్పట్లో అని కోదండరామిరెడ్డి ని యాంకర్ అడుగుతుంది.

- Advertisement -

దీనికి కోందండరామి రెడ్డి సమాధానం చెప్తూ ‘అలాంటిదేమి జరగలేదు.. నాకు తెలిసిన ఒక వ్యక్తి 7,8 ఏళ్ళు పిచ్చివాడిలాగా రోడ్ల మీద ఈ పాట పెట్టుకొని స్టెప్స్ వేసుకుంటూ తిరిగేవాడు. ఆ రోజుల్లో ఆ పాట సృష్టించిన సెన్సేషన్ అలాంటిది’ అంటూ చెప్పుకొచ్చాడు కోదండరామి రెడ్డి. ఇప్పటికీ కూడా అనేక డ్యాన్స్ షోస్ లో రొమాంటిక్ సాంగ్స్ చెయ్యాల్సి వస్తే ఈ పాటనే ఎంచుకుంటూ ఉంటారు డ్యాన్సర్లు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here