Kethika Sharma : మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్. ‘రేయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే వంటి బంపర్ హిట్ చిత్రాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
![Kethika Sharma](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/9bfdcdf7-921d-44f9-aac4-854b57021d6c-819x1024.webp)
ఇక సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా సాయి చాలా మంచి వ్యక్తి. ఈ ప్రశ్నను ఆయనతో పనిచేసిన ప్రముఖులను అడిగితే.. ఆయన గురించి ఏదో ఓ కొత్త క్వాలిటీ తన గురించి చెబుతూనే ఉంటారు. అయితే హీరోయిన్ కేతికా శర్మ సాయి ధరమ్ తేజ్ తోనే కాకుండా ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ భామ.. ఈ ఇద్దరు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/f34e9652-056a-4860-a0e6-87f4bae22b0f-jpg.webp)
ఆమె మాట్లాడుతూ.. నేను వైష్ణవ్తో చాలా సరదాగా ఉండేదానిని. సెట్లో చిన్న పిల్లల్లా కొట్టుకుంటూనే ఉండేవాళ్లం. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా చాలా ఫన్నీ. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే, వైష్ణవ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరిలో సాయి హస్బెంట్ మెటీరియల్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కేతిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.