Jabardasth Comedy Show : మారిన జబర్దస్త్ జడ్జ్.. ఖుష్బూ స్థానంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్

- Advertisement -


Jabardasth Comedy Show : బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న కామెడీ షో జబర్దస్త్. కొన్నేళ్లుగా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా, నాగబాబు మాత్రమే ఉండేవారు. దీంతో ఈ షో టీఆర్పీ రేటింగ్ టాప్ లో ఉండేది. కానీ నాగబాబు, రోజా పలు కారణాలవల్ల వారిద్దరూ జబర్దస్త్ వదిలి వెళ్లిపోయాక ఈ షోలో కాస్త కామెడీ అశ్లీలత ఎక్కువ అయింది. దీంతో షోకు రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతోందని జనాలు భావిస్తున్నారు.

Jabardasth Comedy Show
Jabardasth Comedy Show

ఇక గ్లామర్ బ్యూటీ అనసూయ కూడా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పడంతో పాటు టాప్ కంటెస్టెంట్లు సుధీర్, ముక్కు అవినాష్ తదితర కమెడియన్స్ షో నుంచి వెళ్లిపోయారు. యాంకర్ గా సౌమ్యరావు గత కొద్దిరోజులుగా హోస్టింగ్ చేశారు. తర్వాత ఆమె ప్లేస్ లోకి బిగ్ బాస్ ఫేం సిరి హనుమంతు వచ్చారు. ఇటీవల కాలంలో జబర్దస్త్ షో కి జడ్జిలుగా కృష్ణ భగవాన్, ఖుష్బూ వ్యవహరిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఖుష్బూ ప్లేసులో ఇప్పుడు తాజాగా అలనాటి నటి శ్రీదేవి చెల్లెలు.. హీరోయిన్ మహేశ్వరి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గులాబీ, పెళ్లి వంటి చిత్రాలలో నటించిన ఆమె ఇప్పుడు జబర్దస్త్ షోలో సందడి చేసింది. చాలా కాలం తర్వాత ఆమెను చూడడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. కాకపోతే ఖుష్బూ మార్కు కామెడీ మిస్సయిందని ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఈ ఒక్క ఎపిసోడ్ కు మాత్రమే ఈమె ఉంటుందా లేకపోతే జబర్దస్త్ షో కి తాను ఇలాగే కొనసాగుతుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here