Mahesh Babu : మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఏకైక పవన్ కళ్యాణ్ సినిమా అదేనా..?

- Advertisement -

Mahesh Babu : నేటి తరం స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ని ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. టాక్ తో సంబంధం లేకుండా అన్నీ ప్రాంతాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టే హీరోలు గా వీళ్లిద్దరికీ మంచి పేరు ఉంది. మగధీర తర్వాత మన తెలుగు సినిమా మార్కెట్ ని పెంచడం లో ఈ ఇద్దరి హీరోల సినిమాలు చాలా తోడ్పడ్డాయి.

Mahesh Babu
Mahesh Babu

ముఖ్యంగా మన టాలీవుడ్ కి ఓవర్సీస్ లో ఈ రేంజ్ మార్కెట్ వచ్చింది అంటే, దానికి పునాది వేసిన సూపర్ స్టార్స్ ఈ ఇద్దరే. అందుకే వీళ్ళిద్దరిని టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వారు అని పిలుస్తూ ఉంటారు. అభిమానులు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ సినిమా కాదు కదా, కనీసం వీళ్ళు కలిసి ఒకే ఈవెంట్ లో కనిపించడం కూడా జరగలేదు.

కానీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం మరియు అభిమానం. అయితే వీళ్ళు కలిసి సినిమా చెయ్యకపోయినా కూడా, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం మన అందరం చూసాము. అప్పట్లో మహేష్ బాబు ఇచ్చిన ఈ వాయిస్ ఓవర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇది మాత్రమే కాదు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక సినిమాకి పరోక్షంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడట.

- Advertisement -

ఆ సినిమా మరేదో కాదు, గత ఏడాది ఫిబ్రవరి నెలలో భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకి నిర్మాత సూర్య దేవర నాగవంశీ తో కలిసి మహేష్ బాబు కూడా కొంత భాగం పెట్టుబడి పెట్టాడట. అంతే కాదు కృష్ణ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన షేర్ వసూళ్ళలో కాస్త వాటా కూడా మహేష్ బాబు కి ఇచ్చాడట, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ సినిమాకి సూపర్ స్టార్ నిర్మాతగా వ్యవహరించాడు అనే వార్త తెలుసుకొని అభిమానులు థ్రిల్ కి గురి అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here