లావణ్య త్రిపాఠి కుటుంబం గురించి తెలిస్తే షాక్‌.. అది చూసే మెగా ఫ్యామిలీ ఓకే అన్నారట!

- Advertisement -

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి… కొద్దిరోజులుగా అందరి నోట్లో నానుతున్న పేరు. వరుణ్‌ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవటంతో ఈ భామ హాట్‌టాపిక్‌ అయిపోయింది. 2016 నుంచి ప్రేమించుకున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జూన్‌ 9న అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఉంగరాలు మార్చుకుని వారి ప్రేమ బంధాన్ని ఓ అడుగు ముందుకు తీసుకెళ్లారు. త్వరలో లావణ్య మెగావారి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టనుంది. ఈ ఏడాదిలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ తరుణంలో లావణ్య బ్యాక్‌గ్రౌండ్‌పై కొన్నిరకాల వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలు లావణ్య కుటుంబ నేపథ్యం ఏంటి అని తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారట.

లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. 1995 డిసెంబర్ 15న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించింది. డెహ్రాడూన్‌లోనే పెరిగింది. ఆమె తండ్రి లాయర్‌ వృత్తిలో కొనసాగుతుండగా, ఆమె తల్లి మాత్రం ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. లావణ్యకు సోదరి, సోదరుడు ఉన్నారు. అక్క కమిషనర్‌గా పనిచేస్తున్నారు. లావణ్య డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది. సినిమాల్లో రాణించాలని ముందు నుంచే టార్గెట్ పెట్టుకున్న ఈ అందాల భామ.. మోడలింగ్ రంగంలో రాణించి ఆ తర్వాత సినిమాలవైపు వెళ్లాలని నిర్ణయించుకుందట. ఈక్రమంలో ఆమె ముంబైకి మకాం మార్చేసింది. అక్కడ రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చదివింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన వెంటనే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది.

లావణ్య పాఠశాలలో చదివే రోజుల్లోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమెకు శాస్త్రీయ నృత్యంలో మంచి పట్టుంది. భలేభలే మగాడివోయ్‌ చిత్రంలో భరతనాట్యం చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెుదట పలు టీవీ షోల్లో కనిపించిన లావణ్య క్రమంగా సినిమా అవకాశాలు రావటంతో పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హిందీలో ప్యార్‌ కా బంధన్‌ అనే టీవీ షోలో లావణ్య త్రిపాఠి నటించి, తర్వాత 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇ‍చ్చింది. లావణ్య త్రిపాఠి కుటుంబం ఎతిక్స్, మోరల్స్ వంటి వాటికి కట్టుబడి ఉండే ఫ్యామిలీ అని సమాచారం. ఇవన్నీ నచ్చి లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.

- Advertisement -

కాగా, ‘మిస్టర్‌’ సినిమా కోసం లావణ్య, వరుణ్‌ కలిసి పనిచేశారు. 2017లో సినిమా విడుదలైంది. 2016లో షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా వల్లే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మిస్టర్‌ సినిమా షూటింగ్‌ కోసం చిత్ర బృందం ఇటలీ వెళ్లారట. ఇటలీలోనే వరుణ్‌, లావణ్యల ప్రేమకు బీజం పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016 నుంచే తాము ప్రేమలో ఉన్నట్లు లావణ్య త్రిపాఠి తమ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ హింట్‌ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here