Mahesh Bhatt : ప్రొమోషన్స్ పిచ్చి తో స్టార్ హీరోయిన్ ని చంపేసిన హీరోయిన్ అలియా భట్ తండ్రి!

- Advertisement -

Mahesh Bhatt : ఒక సినిమాకి ప్రమోషన్ చెయ్యడం తప్పనిసరి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రొమోషన్స్ కోసమే సినిమా తియ్యడం మాత్రం కరెక్ట్ కాదు. ఎలా అయినా ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ, ఒక వ్యక్తిని చంపి మాత్రం ప్రొమోషన్స్ చెయ్యకూడదు. గతం లో అక్కినేని నాగార్జున సినిమా విషయం లో ఇది జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆరోజుల్లో నాగార్జున హీరో గా క్రిమినల్ అనే మూవీ తెరకెక్కింది.

ఈ సినిమా డైరెక్ట్ హిందీ చిత్రం గా తెరకెక్కి, తెలుగులో అనువాదం అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ గా ప్రస్తుత క్రేజీ హీరోయిన్ అలియా భట్ తండ్రి మహేష్ భట్ వ్యవహరించాడు. ఆరోజుల్లో ఈ సినిమా ప్రమోషన్ కోసం మహేష్ భట్ ఒక చీప్ ట్రిక్ ని ఉపయోగించాడు. ఈ చీప్ ట్రిక్ వల్ల మహేష్ భట్ చాలా కాలం వరకు బయటకి రావడానికి భయపడ్డాడు.

Mahesh Bhatt
Mahesh Bhatt

ఇంతకీ ఆయన చేసిన ఆ ఘనకార్యం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘మనీష కొయిరాలా’ చనిపోయింది అంటూ అన్నీ ప్రధాన పత్రికలలో ప్రకటన వేయించాడు. ఇది నిజమని నమ్మిన అభిమానులు బోరుమని విలపించారు. అప్పట్లో మనీష కొయిరాలా కి ఉన్న క్రేజ్ వేరు. ఆమె అభిమానులు కొంతమంది ఆ మరణ వార్త విని ఆత్మహత్యాయత్నం కూడా చేసారు.

- Advertisement -

కానీ ఆ మరుసటి రోజే డైరెక్టర్ మహేష్ భట్ ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే చేసిందని, మనీష కొయిరాలా కి ఏమి కాలేదని, ఆమె సురక్షితంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వెర్రిక్కిపోయిన మనీషా అభిమానులు మహేష్ భట్ పై దాడి చేసే స్థాయికి దిగిపోయారు. ప్రొమోషన్స్ కోసం బంగారం లాంటి మనిషిని చంపేస్తావా అంటూ అతను కారుని వెంబడించి మరి రాళ్లు విసిరారు. ఆ సమయం లో మహేష్ భట్ పోలీస్ సెక్యూరిటీ తో బయటకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here