అలాంటి పనులు రహస్యంగా చేయాలట.. ఆరిలేషన్ పై పచ్చిగా చెప్పిన చార్మి

- Advertisement -

నీతోడు కావాలి అంటూ 2002లో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన పంజాబీ భామ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించింది. నటిగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ.. ప్రస్తుతం చిత్ర నిర్మాతగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. లాస్ట్ ఇయర్ ఛార్మీ నిర్మాతగా లైగర్ అనే సినిమా అందరి అంచనాలు తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇపుడు రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

చార్మి
చార్మి

అయితే లైగర్ తలనొప్పులు పూరి-ఛార్మిలను ఇంకా వదల్లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నైజాం ఎగ్జిబిటర్స్, లీజర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లైగర్ నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించాలని నిరసన చేస్తున్నారు. మొత్తంగా రూ. 9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెన్షన్స్ మధ్యే ఛార్మి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. నచ్చిన ప్రదేశాన్ని వెళ్ళండి, నచ్చిన వాళ్ళను ప్రేమించండి, ఆనందంగా జీవించండి… కానీ ఎవరికీ చెప్పొద్దు. జనాలు నాశనం చేస్తారు, అని కామెంట్ పెట్టారు. ఛార్మి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఛార్మి కౌర్
ఛార్మి కౌర్

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, కన్నడలో దాదాపు 40 పైగా సినిమాల్లో కథానాయికగా మెప్పించిన ఛార్మి కౌర్. యంగ్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్ సరసన మెరిసిన అందాల ఛార్మి. తెలుగులో చిరంజీవి తప్ప మిగిలిన సీనియర్ టాప్ హీరోలైన బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ సరసన నటించిన ఛార్మి. ‘మంత్ర’ సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న ఛార్మి కౌర్. ‘మంగళ’ సినిమాలోని నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ఛార్మి కౌర్.తెలుగులో ‘జ్యోతి లక్ష్మి’ ‘మంగళ 2’ తర్వాత నిర్మాత మారిన ఛార్మి కౌర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here