Guntur Kaaram : నిమిషానికి 10 వేల టిక్కెట్లు.. ట్రేడ్ పండితులకు ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్న ‘గుంటూరు కారం’ బుకింగ్స్!

- Advertisement -

Guntur Kaaram : రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద మార్కెట్ లో మొదటి నుండి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను పెంచుకుంటూ వెళ్లేలా చేసింది.

Guntur Kaaram
Guntur Kaaram

కానీ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ రాజ్యం ఏలుతున్న రోజుల్లో మహేష్ లాంటి సూపర్ స్టార్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎందుకు చేసాడు అనే నెగటివిటీ కూడా సోషల్ మీడియా లో ఉంది. కానీ మహేష్ బాబు స్టార్ స్టేటస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ నెగటివిటీ ని తుడిచిపెట్టేసింది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రాంతం లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రీమియర్ షోస్ కి 1 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Mahesh Babu

అలాగే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న ఉదయం పూర్తి స్థాయి లో ప్రారంభం అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం ట్రెండ్ చూసి ట్రేడ్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. బుక్ మై షో మరియు పేటీఎం వంటి టికెట్ పోర్టల్ యాప్స్ లో నిమిషం గ్యాప్ వ్యవధిలో దాదాపుగా 10 వేలకు పైగా టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లో అమ్ముడుపోయాయి అట.

- Advertisement -
Guntur Kaaram Mahesh Babu

రీసెంట్ గా విడుదలైన సినిమాలలో ‘సలార్’ కి తప్ప ఏ చిత్రానికి కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేదు. సోషల్ మీడియా లో ఇంత నెగటివిటీ ని మూటగట్టుకున్న ఈ చిత్రానికి, ఇలాంటి బుకింగ్స్ జరుగుతాయని అసలు అనుకోలేదు అంటూ ట్రేడ్ పండితులు కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి, కానీ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అనుకున్న రేంజ్ బుకింగ్స్ లేవు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here