Guntur Kaaram : ఇంతకంటే దారుణం ఉండదేమో.. గుంటూరు కారం థియేటర్లో 10 మందే!

- Advertisement -

Guntur Kaaram : గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లోనే వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఐదు రోజుల్లో 150 కోట్ల‌కుపైగా గ్రాస్‌, 90 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ను ఈ మ‌హేష్ మూవీ రాబ‌ట్టింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.

Guntur Kaaram
Guntur Kaaram

ఫ‌స్ట్ డేనే ఈ మూవీ 94 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. బుధ‌వారం రోజు ఈ సినిమా 15 కోట్ల‌కుపైగా గ్రాస్‌, ఏడు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. బుధ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. కాగా గుంటూరు కారం థియేట‌ర్ల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చేస్తోన్న కొన్ని ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. గుంటూరు కారం స్క్రీనింగ్ అవుతోన్న మ‌ల్టీఫ్లెక్స్ థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తోన్న‌ట్లు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తోన్నారు.

Mahesh babu

హైద‌రాబాద్‌లోని పీవీఆర్ థియేట‌ర్‌లో గుంటూరు కారం సినిమాను ప‌దిమందితోనే స్క్రీనింగ్ చేశార‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో కాకుండా స్పెష‌ల్ స్క్రీనింగ్ చూసిన ఫీలింగ్ క‌లిగింద‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. గుంటూరు కారం థియేట‌ర్స్ చాలా వ‌ర‌కు ఖాళీగానే ఉన్నా మిగిలిన సినిమాల‌కు వాటికి కేటాయించ‌డం లేద‌ని మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. వీరి ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here