Bigg Boss Telugu : శోభా శెట్టికి అలాంటి పనులు సైగలు చేసిన గౌతమ్.. ఇదేం బుద్ధంటున్న తోటి కంటెస్టెంట్స్..

- Advertisement -

Bigg Boss Telugu : నామినేషన్స్‌కు సంబంధించిన రెండు ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తంలో శోభా శెట్టి, సందీప్, శివాజీ జడ్జిలుగా వ్యవహరించారు. ఈసారి కంటెస్టెంట్స్‌లో ఎవరు నామినేట్ అవ్వాలి అనే విషయాన్ని సగం వరకు కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే.. దాని తుది నిర్ణయం ఈ జడ్జిల చేతిలో ఉంది. ఎంత జడ్జిలు అయినా కూడా కొన్నిసార్లు వారి నిర్ణయం కూడా తప్పు అయ్యే అవకాశం ఉంది.

Bigg Boss Telugu :
Bigg Boss Telugu :

గౌతమ్ కృష్ణ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. శోభా శెట్టికి, గౌతమ్‌కు జరిగిన వాగ్వాదం సమయంలో చేతితో సైగలు చేశాడు అని పల్లవి ప్రశాంత్ ఆరోపణలు చేసినా కూడా నిజంగా గౌతమ్.. అలా చేశాడా లేదా అని చాలామందికి క్లారిటీ లేదు. కానీ ఆ గొడవ జరిగిన సమయంలో ‘‘నా ఫిజికాలిటీ గురించి నువ్వు మాట్లాడావు. నీ ఫిజికాలిటీ గురించి నేను మాట్లాడలేదు’’ అంటూ చేతితో సైగలు చేసి చూపించాడు గౌతమ్.

శోభా శెట్టి

అయితే, షో ఆఫ్ చేస్తున్నావ్ అంటూ సైగలు చేశాడని ప్రశాంత్ చెప్పిన దాంట్లో నిజం లేదు. ఈ వివాదానికి నాగార్జున తెర వేస్తారో లేదో చూడాలి. అయితే, ప్రశాంత్ ఈ పాయింట్ పట్టుకుని శోభాశెట్టికి హెల్ప్ చేయడమే కాకుండా గౌతమ్‌ను ఇరకాటంలో పడేశాడు. మరోవైపు శుభశ్రీ, ప్రిన్స్ యావర్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దీంతో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ‘‘నువ్వు నా ఫ్రెండ్ అయితే గౌతమ్‌ను వదిలేయ్’’ అని శుభశ్రీకి సలహా ఇచ్చాడు యావర్. దీనికి శుభశ్రీ సమాధానం ఇస్తూ.. ‘‘నేను తనని పట్టుకోలేదు కదా’’ అని పేర్కొంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here