Geetha Madhuri : జూదం ఆడి లక్షల రూపాయిలు పోగొట్టుకున్న ప్రముఖ సింగర్ గీత మాధురి.. మరీ ఇంత పిచ్చినా!

- Advertisement -

Geetha Madhuri : స్టార్ సింగర్ గా గీత మాధురి కి టాలీవుడ్ లో ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న గీత మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 2 స్థానం లో నిల్చుంది. అప్పటి నుండి ఈమె సోషల్ మీడియా లో ఎదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉంది.

Geetha Madhuri
Geetha Madhuri

రీసెంట్ గా ఆమె తన భర్త నందు తో విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది. దీనిపై ఆమె భర్త నందు స్పందించి ఇందులో ఎలాంటి నిజం లేదని, చెత్త వార్తలను నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Geetha Madhuri Photos

ప్రతీ మనిషి ఎదో ఒక విషయం లో పూర్తిగా అడిక్ట్ అవుతారు, అలా గీతామాధురి కూడా జూదానికి అడిక్ట్ అయ్యిందట. ఈ విషయం స్వయంగా ఆమెనే ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. నాకు కేసినో గేమ్స్ ఆడడం చాలా ఇష్టం, ఒక్కసారి ఆట మొదలు పెట్టాను అంటే ఇక ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. అలా నేను ఆస్ట్రేలియా లో కేసినో ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -
SInger Geetha Madhuri

మూడు లక్షల రూపాయిలు పోగొట్టుకున్నారు అంట కదా అని యాంకర్ అడగగా, ఆ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు లేండి, మూడు లక్షలు చాలా చిన్న అమౌంట్, అంతకు మించి నేను ఆటలో చాలా పోగొట్టుకున్నాను, ఇప్పటికీ నాకు కేసినో ఆడాలని ఉంది కానీ, అమ్మ కోసం ఇక ఇలాంటి ఆటలు ఆడకూడదు అని నాకు నేను ఒట్టు పెట్టుకున్నాను అంటూ గీతా మాధురి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here