ప్రాజెక్టు కే సినిమా నుంచి సాలీడ్ అప్డేట్

- Advertisement -

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన నటించిన అన్నిసినిమాలు పాన్ ఇండియా లెవల్లో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16న విడుదలై కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు అనిపించుకుంది. వీకెండ్ వరకు కలెక్షన్లు బాగానే వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కొంత డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. టీజర్ జులై మొదటి వారంలో రాబోతున్నట్లు సమాచారం.

ప్రభాస్
ప్రభాస్

అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం ప్రాజెక్ట్-K సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ కూడా జులైలో రిలీజ్ చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోషన్ పోస్ట ర్ ను ఇండియాలోనే కాకుండా యూఎస్ లో భారీ ఈవెంట్ గా ప్లాన్ చేసి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్-K సినిమా ఫస్ట్ ప్రమోషన్ యూఎస్ఏ లో మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రాజెక్ట్ కే సినిమా వరల్డ్ వైడ్​ గా మంచి బజ్ ఏర్పడడం పక్క అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ వంశీ. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబచ్చన్ ,దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు నటిస్తున్నారు.

project-k
project-k
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here