ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్లో ఒక సీటును ఎందుకు ఖాళీగా ఉంచుతారో తెలుసా..?

- Advertisement -

ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకేకుతున్న అత్యంత ప్రతిష్టాత్మాకమైన చిత్రం ఆదిపురుష్.. రామాయణం ఆధారంగా తెరెక్కబోతుంది.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చినజీయర్ స్వామి రాబోతున్నారు..సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచుతుంది. అలాగే సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోంది.. ఇది ఇలా ఉండగా.. ఈ నిర్మాణ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది..

అదేంటంటే..సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ లో ఒక సీటును ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు.. అంతేకాదు ఒక లెటర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..ఇందులో.. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది.

- Advertisement -

అతి గొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్ ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం అని తెలిపారు.. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here