Disha Patani : అల్లు అర్జున్ స‌ర‌స‌న దిశా పటానీ .. ?

- Advertisement -

Disha Patani : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్, మరికొందరు నటీనటులపై కొన్ని రాజకీయ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Disha Patani
Disha Patani

ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప’లో ఊ అంటావా మావా.. అనే సాంగ్‌ సమంత స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో ఊపుఊపేసింది. అందులో నటించిన స‌మంత‌కు కొంచెం బ్యాడ్ ఇంప్రెష‌న్ వ‌చ్చిన స‌మంత న‌టించిన ఐట‌మ్ మ‌మూలుగా పాపుల‌ర్ కాలేదు. కుర్ర కారును ఓ ఊపు ఊపేసింది. ఒక‌ప్పుడు బావ బావ‌మ‌రిది సినిమాలోని సిల్క్ స్మిత న‌టించిన బావ‌లు స‌య్యా అనే సాంగ్ అప్ప‌ట్లో ఎంత హిట్టు కొట్టిందు అంత‌లా దూసుకుపోయింది స‌మంత ఐట‌మ్ సాంగ్. విడుదలై రెండేళ్లు కావస్తున్నా ఈరోజు పలు ఈవెంట్లలో ఈ పాట ప్లే అవుతోంది అంటే ఈ పాట ఎంత హిట్ అయ్యిందో అర్థమవుతుంది.

అయితే ఈ పుష్ప సెకండ్ పార్ట్ లోనూ ఐటెం సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ పాట కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ నటిస్తోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కూడా దిశా పటాని చేస్తోందని, ఈ పాట కూడా మొదటి భాగంలోని పాట కంటే పెద్ద హిట్ కొడుతుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ పాట కోసం త్వరలో సెట్ వేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here