Samantha కు మరో కొత్త రోగం..? ఈసారి ఆమెను దేవుడే కాపాడాలి

- Advertisement -


Samantha గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కోసం ఇప్పటి వరకు ఆమె చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. విదేశాలలో పెద్ద డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకుంది. ఇక లాస్టుకు వ్యాధి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమె తిరిగి రాగానే తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసింది. ఇక తాను నటించిన సినిమా విడుదల చేసి హిట్టు కూడా కొట్టేసింది. అయితే సమంతకు మళ్లీ మయోసైటిస్ తిరగబెట్టిందని.. అందుకే మరో సారి ఆమె వ్యాధి నివారణకు చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిందంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

Samantha
Samantha

కాకపోతే, సమంత ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లింది నిజమే కానీ.. అది మయోసైటిస్‎కి కాదట. తాను మరో కొత్త రోగం బారిన పడిందట. ఆ కారణంగానే సమంత డాక్టర్స్ దగ్గర టెస్ట్ చేయించుకుని అందుకు తగ్గ ట్రీట్ మెంట్ కోసం అన్ని సర్దుబాటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమంత

ఈ వ్యాధి మయోసైటీస్ కన్నా డేంజర్ కాకపోయినా తనకు మాత్రం ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉందట . ఈ వ్యాధి కూడా తాను ఓవర్ గా వ్యాయామం చేయడం వల్లే వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత అభిమానులు మాత్రం ఇది రూమర్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వార్తలపై ఆమె క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here