దగ్గుపాటి రానా తో ‘కల్లు’ తాగించిన గంగవ్వ..వైరల్ అవుతున్న వీడియో

- Advertisement -

భీమ్లా నాయక్ సినిమా తర్వాత దగ్గుపాటి రానా ఎలాంటి సినిమాల్లోనూ కనిపించని సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సినిమా భీమ్లా నాయక్. ఇందులో పవన్ కళ్యాణ్ కి పోటీగా నువ్వా నేనా అన్నట్టుగా నటించాడు. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి ‘విరాట పర్వం’ అనే సినిమా విడుదలైంది.

దగ్గుపాటి రానా
దగ్గుపాటి రానా

ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని, కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ లో వద్దామా, లేదా థియేటర్స్ లో వద్దామా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమా తర్వాత ఆయన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసాడు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, నెట్ ఫ్లిక్స్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

అయితే ప్రస్తుతం రానా ఏ చిత్రం లో కూడా నటించడం లేదు , రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన మంచి చిల్లింగ్ మూడ్ లో ఉన్నాడు. యూట్యూబ్ లో పాపులర్ షో గా ప్రసిద్ధి గాంచిన ‘మై విలేజ్’ ప్రోగ్రాం లో రానా పాల్గొన్నాడు. పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానా కి గంగవ్వ తాటి కల్లు ఇచ్చింది.

- Advertisement -

ఇది తాగి రానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో ‘మై విలేజ్ షో ‘ అనే ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. గంగవ్వ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో ద్వారా ఆమె మంచి క్రేజ్ మరియు పాపులారిటీ ని దక్కించుకొని బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా కూడా అడుగుపెట్టింది, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది గంగవ్వ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here