ఒకేసారి ఇద్దరు భామలతో స్టెప్పులు వేయనున్న మెగాస్టార్‌ చిరంజీవి..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక చిరంజీవి – మెహర్‌ రమేష్‌ కలయికలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. అన్నాచెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

చిరంజీవి
చిరంజీవి

తమిళంలో అజిత్ కుమార్ నటించిన వేదాళం సినిమాకు ఇది రిమేక్ గా తెరకెక్కుతుంది. సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ సినిమాని ఇప్పుడు తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. ప్రస్తుతానికి ఈ సినిమా యూనిట్ చిరంజీవి తమన్నా ఇద్దరి మీద ఒక మంచి మాస్ సాంగ్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ లో తమన్నా భాటియాతో పాటు కీర్తి సురేష్ కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ పాటకు తమన్నా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు కలిసి కాలు కదపబోతున్నట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi

అటు ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి ప్లాన్‌ వర్క్‌ అవుట్‌ అవుతందని చిత్ర బృందం భావిస్తోందట. ఇదే జరిగితే నందమూరి, మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతారని మేకర్స్ స్కెచ్‌ వేస్తున్నట్లు సమచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here