Rajamouli : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. భూకంపంలో చిక్కుకున్న రాజమౌళి

- Advertisement -

Rajamouli : ప్రస్తుతం దేశంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు రాజమౌళి. ఆయన ఇటీవలే పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ క్ర‌మంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో రాజమౌళి పాల్గొనేందుకు జపాన్ దేశానికి వెళ్లారు.

అయితే తాజాగా జపాన్ లో భూకంపం సంభ‌వించ‌డం దాని నుంచి రాజ‌మౌళి ఫ్యామిలీ తృటిని తప్పించుకోవ‌టం అంద‌రిని షాక్ కు గురి చేసింది. కాగా ఈ విషయాన్ని రాజ‌మౌళి కొడుకు కార్తికేయ తన ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఓ బిల్డింగ్‌లో మేము 28వ అంతస్తులో ఉన్న టైంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందంటూ చెప్పుకొచ్చాడు. జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో మేము ఇప్పుడే చూసాము. చాలా టెన్షన్ అనిపించింది. అయితే మేము ఎంత కంగారు పడ్డా.. జపానీలు మాత్రం ఎలాంటి భయం బాధ లేకుండా.. వారి పని వారు చేసుకుంటూ.. ఏదో వానజల్లు పడుతుందా అన్నంత తేలికగా రియాక్ట్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మేమైతే భూకంపాన్ని ఎక్స్ పీరియన్స్ చేసాం అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

- Advertisement -
Rajamouli
Rajamouli

ఈ విషయాన్ని తెలుసుకున్న రాజమౌళి అభిమానులు ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగిందా అని మొద‌ట ఆందోళన పడ్డా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి అపజయం ఎరుగని డైరెక్టర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాజమౌళి.. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ ఎస్ ఎం బి 29ను పాన్ వరల్డ్ సినిమాగా తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తయినట్లు ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here