‘విరూపాక్ష’ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..హీరోయిన్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

ఈ సమ్మర్ కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘విరూపాక్ష’. సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ఈ సినిమా ఇంత పెద్ద సంచలన విజయం సాదిస్తుందని మూవీ టీం తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఈమధ్య హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

విరూపాక్ష
విరూపాక్ష

కాంచన సిరీస్ వంటి సినిమాలు బాగానే ఆడాయి కానీ, ఒక పూర్తి స్థాయి హారర్ చిత్రం వచ్చి చాలా కాలమే అయ్యింది. దాంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి మరీ చూసారు. ఫలితంగా 23 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

అదేమిటని ఈ చిత్రం హిందీ లో అతి త్వరలోనే రీమేక్ అవ్వబోతుందట. ప్రముఖ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. రీసెంట్ గానే ఈ హీరో అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసాడు. ఈ చిత్రం అక్కడ పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మరో రీమేక్ పై కన్నేశాడు, కనీసం ఇదైనా సక్సెస్ ని ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుందట, మన తెలుగు లో హీరోయిన్ సంయుక్త మీనన్ ఎంత అద్భుతంగా నటించిందో మన అందరికీ తెలిసిందే. చివరి 15 నిమిషాలు ఆమె ఆడియన్స్ కి వణుకు పుట్టించింది. మరి కైరా అద్వానీ ఆ రేంజ్ లో చేస్తుందో లేదో చూడాలి, ఇప్పటికే విరూపాక్ష హిందీ డబ్ వెర్షన్ థియేటర్స్ లో విడుదలైంది, ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదు. మరి ఒరిజినల్ వెర్షన్ కి హిందీ లో ఆదరణ దక్కనప్పుడు, ఇక రీమేక్ వెర్షన్ ని ఎంత మాత్రం చూస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here