Bigg Boss Telugu : అమర్ దీప్ తో గొడవలు.. నెమ్మదిగా పల్లవి ప్రశాంత్ కి దగ్గర అవుతున్న ప్రియాంక!

- Advertisement -

Bigg Boss Telugu : తెలుగు లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినా ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో గేమ్స్ ఆడేటప్పుడు కంటెస్టెంట్స్ కొంతమంది గ్రూప్స్ గా ఆడుతూ రావడం అనేది జరుగుతూనే ఉంది. దీనిని గ్రూప్ అని పిలవొచ్చు, లేదా ఫ్రెండ్ షిప్ అని పిలవొచ్చు ఎలా అయినా పిలవొచ్చు. ఇదే సదరు కంటెస్టెంట్స్ కి మైనస్ అవుతుంది అనేది వాస్తవం. ఈ సీజన్ లో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

శివాజీ, పల్లవి ప్రశాంత్ మరియు యావర్ ఒక టీం గా మొదటి నుండి ఉంటుంటే, అమరదీప్, శోభా శెట్టి, టేస్టీ తేజా మరియు ప్రియాంక ఒక గ్రూప్ గా ఉంటారు. అమర్ దీప్ రైతు బిడ్డ సెంటిమెంట్ తో వచ్చిన ప్రశాంత్ ని మొదటి వారం లో టార్గెట్ చెయ్యడం వల్ల ఈ బ్యాగ్ మీద నెగటివిటీ ఏర్పడింది. ఏ చిన్న తప్పు జరిగిన భూతద్దం లో చూడడం మొదలు పెట్టారు.

Amar deep priyanka

ముఖ్యంగా ప్రియాంక మరియు అమర్ దీప్ బయట ఎన్నో ఏళ్ళ నుండి స్నేహం గా ఉంటూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి జానకి కలగనలేదు సీరియల్ లో నటించారు. ఈ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. ఈ సీరియల్ కోసం నాలుగేళ్లు కలిసి ప్రయాణం చెయ్యడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అదే స్నేహం ని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇన్ని రోజులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే నిన్న జరిగిన టాస్కు తర్వాత అమర్ దీప్ మరియు ప్రియాంక మధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయి.

- Advertisement -
priyanka vs amar deep

‘నువ్వు ఏదైనా అన్నప్పుడు నేను తీసుకుంటాను, కానీ నేను ఏదైనా అన్నప్పుడు మాత్రం నువ్వు తీసుకోవు’ అని ప్రియాంక ని అంటాడు అమర్ దీప్. దీనికి ఆమెకి చాలా కోపం వస్తాది. అలా ఎందుకు అన్నావు, జనాలకు ఏమి ప్రూవ్ చెయ్యాలని చూస్తున్నావు అంటూ ప్రియాంక అమర్ దీప్ ని సీరియస్ గా అడుగుతుంది. మరోపక్క ఆమె పల్లవి ప్రశాంత్ తో చాలా మంచిగా మాట్లాడడం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తుంటే అమర్ దీప్ కి కటీఫ్ చెప్పి ప్రశాంత్ తో ప్రియాంక స్నేహం చెయ్యబోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here