Bigg Boss : బిగ్ హింట్ ఇచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీళ్లే ?

- Advertisement -

Bigg Boss తెలుగు సీజన్ 7 ప్రస్తుతం హయ్యస్ట్ టీఆర్పీతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అంతకు ముందు వచ్చిన సీజన్ సిక్స్ ఫ్లాప్‌ అవడంతో ఈ సారి ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో ఈ సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. బిగ్‌బాస్ మొదటి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతూ కష్ట తరమైన టాస్క్ లతో షోపై జనాల్లో ఆసక్తి పెంచేశారు. సీజన్ 7మొత్తం ఉల్టా పల్లా అంటూ నాగార్జున చెప్పడంతో.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటే ఇలానే ఉంటుందంటే అనేక రకాలు న్యూస్ లు వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నింటిలో ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయింది.

Bigg Boss
Bigg Boss

తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ లంచ్ 2.0 ఉండబోతుందంటూ న్యూస్ వైరల్ అవడంతో షో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల హోస్ట్ నాగార్జున నోటి నుంచే నేరుగా ఆ హింట్‌ రావడంతో.. షో మళ్లీ గ్రాండ్ లాంచ్ కచ్చితంగా ఉంటుందని అర్థమైపోయింది. అక్టోబర్ 8న లాంచ్ ఉండబోతుందని తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే న్యూ కంటెస్టెంట్లు కూడా రెడీ అయ్యారట. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గ్రాండ్ లాంచ్ లో ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. బుల్లితెర నటుడు అంబటి అర్జున్, అంజలి పవన్, పూజ మూర్తి, గోలి షావలి, నైనీ పావని వీళ్లు ఐదుగురు ఈ సెకండ్ లాంచ్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట‌. ఒక వేళ్ల వీళ్లే నిజంగా హౌస్ లోకి వెళ్లకపోయినా గ్రాండ్ లాంచ్ మాత్రం కచ్చితంగా ఉంటుందట. ఇప్పటివరకు బిగ్‌బాస్ సీజన్ 7 పై వచ్చిన రూమర్స్ నిజం అయ్యాయి. ఇది కూడా నిజం అవుతుందని నమ్ముతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here