Bigboss: బిగ్ బాస్ లో రచ్చ చేస్తున్న శోభా శెట్టి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా.. చూస్తే షాకవుతారు..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌గా ఏడో సీజన్‌ షురూ అయ్యింది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ లేటెస్ట్ సీజన్ సెప్టెంబర్‌ 3న టలకు ప్రారంభం అయ్యింది.. ఈసారి మొత్తంగా 14 మందిని పిలిచారు. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక అది అలా ఉంటే ఈ షోలో తన ఆటపాటలతో పాటు అందచందాలతో అదరగొడుతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభా శెట్టి విషయానికి వస్తే..

కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుుకుంది ఈ కన్నడ అందం. ఆ సీరియల్‌లో మోనిత పాత్రలో విలనిజాన్ని చూపిస్తూ.. తన నటనతో అదరగొట్టింది. కార్తీక దీపం సీరియల్‌లో కార్తిక్ లేని కార్తీక దీపం ఉండోచ్చేమో కానీ.. మోనిత లేని కార్తిక దీపాన్ని చూడలేము. అలా తన నటనతో అదరగొట్టింది. ఇక ప్రస్తుతం ఈ భామ బిగ్ బాస్ తెలుగు 7లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన టాస్క్‌లతో కేక పెట్టిస్తోంది. అసలు ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు. బెంగళూర్ లో జన్మించిన ఈమె ఎమ్మెస్సీ వరకు చదువుకుంది. తన తాతయ్యకు నటన అంటే చాలా ఇష్టం ఉండేదని, తన తాతయ్య ద్వారానే యాక్టింగ్ నేర్చుకున్నా అని శోభా తెలిపింది. చిన్నతనంలోనే భరత నాట్యం చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది శోభా.

అంతే కాకుండా శోభా వల్ల తాతయ్యకు ఒక డ్రామా కంపెనీ ఉండేది. అందుకే ఆమె యాక్టింగ్ నేర్చుకోవడం సులువైందని ఆమె తెలిపింది. శోభా కార్తీక దీపం సీరియల్ లో మాత్రమే కాకుండా అగ్ని సాక్షి లాంటి సీరియల్స్ తో పాటు తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్ లో ఈమె నటించింది. డిగ్రీ చదివేటప్పటి నుంచే సీరియల్స్ లో నటిస్తూ, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతుంది శోభా. తన ఇంట్లో నాలుగో సంతానం. ప్రారంభంలో తన కుటుంబ సభ్యులే ఆమెకు యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పించే వారట. అలా మొదటగా కన్నడ సీరియల్ ఒక లీడ్ రోల్ అవకాశం వచ్చింది.

- Advertisement -

అక్కడ అది బాగా హిట్ అవ్వడంతో కార్తీక దీపం సీరియల్ కి ఎంపిక చేశారట. ఇదిలా ఉండగా శోభా అగ్ని సాక్షి సీరియల్ లో చేస్తున్నప్పుడే కన్నడలో అంజనీ పుత్ర సినిమాలో అవకాశం వచ్చింది. అందులో హీరోయిన్ గా శోభా చేస్తే, పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేశారు. ఈ సినిమా 70 రోజుల్లోనే 50 కోట్లను వసూలు చేసింది. ఇకపోతే 2019లో కార్తీక దీపం సీరియల్ కి గానూ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ కూడా అందుకున్నారు మోనిత అదేనండీ శోభా. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఈ అమ్మడి యాక్టింగ్ చూస్తుంటే ఆ టైటిల్ కూడా దక్కించుకునేలా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here