బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరిలో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా..!

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. సెప్టెంబర్ 3 ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్ కనిపించబోతున్నాడు. ఇక రేపట్నుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు బిగ్‌బాస్ షో ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపించబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. ఆ సెలబ్రిటీ లోపాలకి వెళ్లబోతున్నాడు, ఈ స్టార్ కంటెస్టెంట్ గా రాబోతున్నాడని. తాజాగా రియల్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేశారు.

Bigg Boss

తొలి కంటెస్ట్ గా జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ ను నాగార్జున ఇన్వయిట్ చేశారు. రెండో కంటెస్ట్ గా హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లారు. మూడో కంటెస్ట్ గా సింగర్ దామిని ఎంటరయ్యింది. నాల్గో కంటెస్ట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐదో కంటెస్ట్ గా యాక్టర్ కమ్ లాయర్ శుభశ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆరో కంటెస్ట్ గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. ఏడవ కంటెస్ట్ గా కొరియోగ్రాఫర్ ఆట షో సందీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఎనిమిదో కంటెస్ట్ గా శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం మోనిత అంటే అందరూ గుర్తు పడతారు.

తొమ్మిదో కంటెస్ట్ గా ఫుడ్ వీడియోలతో యూట్యూబ్ లో పాపులర్ అయిన టేస్టీ తేజ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్ట్ గా నటి రతిక ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె..తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌస్ లోకి వచ్చానని చెప్పింది. అయితే ఈ సారి అందరిలో ఉన్న ఓ కామన్ పాయింట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడూ కనీసం ఇద్దరు కొత్తవాళ్లనైనా తీసుకునే బిగ్ బాస్.. ఈసారి మాత్రం సెలబ్రెటీల లిస్ట్ లోకి వచ్చే వాళ్లనే తీసుకున్నాడు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా జరగనుందని సంబర పడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here