Mojaksha : తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ సరదా ముచ్చట్లు.. మళ్లీ వారసుడొచ్చాడంటూ నెట్టింట రచ్చ

- Advertisement -

Mojaksha : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీతో ఆయన చేస్తున్న సినిమాకు కొన్ని రోజులు బ్రేక్ పడింది. హిందూపురం నుంచి ఆయన మరోసారి బరిలోకి దిగారు. బాలయ్య ప్రజలు, ప్రేక్షకులకు ఎంత విలువ ఇస్తారో.. ఫ్యామిలీ అంటే ప్రాణం పెడతారన్న విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. అంత పెద్ద ఫ్యామిలీలోనూ బాలయ్య బాబు అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు.

ముఖ్యంగా తారకరత్న ఫ్యామిలీ అంటే బాలయ్యకు మక్కువ ఎక్కువ. ఇటీవలే నటుడు, టీడీపీ నేత తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి బాలయ్య అండగా నిలుస్తున్నారు. ఆ ఇంటికి పెద్ద దిక్కులా తారకరత్న పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు. తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో యాక్టివ్. తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతుంటారు.

- Advertisement -

తాజాగా అలేఖ్య నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఇప్పటికే తనకు మావయ్య బాలకృష్ణపై అనేకసార్లు అభిమానాన్ని చూపించిన అలేఖ్య.. తాజాగా మరో పోస్టు పెట్టారు.  “నన్ను ఎప్పుడూ అందరూ ఎటు వైపు ఉంటానని అడుగుతున్నారు. తాను ఎప్పుడూ ప్రేమ, మానవత్వం, ముఖ్యంగా కుటుంబం వైపే ఉంటాను. మావయ్య (బాలకృష్ణ) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం” అంటూ పోస్టు పెట్టారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here