Nagarjuna : అక్కినేని అభిమానులకు అలర్ట్.. త్వరలోనే గుడ్ న్యూస్

- Advertisement -


Nagarjuna : ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు ఇటు సోషల్ మీడియా.. అటు సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైన అక్కినేని ఫ్యామిలీ తాజాగా అందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతుందట. అసలు ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీలో ఒక్కటంటే ఒక్క ఫంక్షన్ కూడా జరగలేదు. ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం ఒక్కటే జరిగింది.

అయితే అది పార్టీ అని మాత్రం అనలేము. కాగా ఇటీవల నాగార్జున నటించిన ‘నా స్వామి రంగా’ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్స్ బాటపడుతూ ఉండడంతో నాగార్జున ఫుల్ ఖుషీగా ఉన్నారట. ఈ క్రమంలోనే తన క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ను పిలిచి పార్టీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు మొదట ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత రాత్రికి పెద్ద పార్టీ ఇవ్వాలంటూ డిసైడ్ అయ్యాడట నాగార్జున. ఈ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఆయన బిజినెస్ పార్టనర్స్ కూడా హాజరవబోతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కాగా ఘోస్ట్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకుని నటించిన సినిమా నా సామి రంగా. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున నటన అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here