సుధీర్ తో కలిసి ఒంటరిగా అక్కడికి వెళ్లాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన రష్మి

- Advertisement -

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ అయిన స్టార్ మాలో వచ్చిన, వస్తున్న బెస్ట్ రియాల్టీ షోలలో సిక్స్త్ సెన్స్ (Sixth Sense) కూడా ఒకటి. ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటుడు ఓంకార్ హోస్ట్ చేసే ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదో సీజన్ లో కూడా అలరిస్తోంది. తాజా ఎపిసోడ్ కు యాంకర్ రష్మి మరియు బ్రహ్మాజీ వచ్చారు. వారి సరదా ముచ్చట్లతో అల్లరి చేసి అందరినీ అలరించారు.

యాంకర్ రష్మి
యాంకర్ రష్మి

డ్రైఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అని రష్మి చెప్పిన దానికి బ్రహ్మాజీతో పాటు ఆడియన్స్ అంతా పగలబడి నవ్వారు. డ్రైప్రూట్స్ ను ఎవరూ లేనప్పుడు తినాలి. అవి తినేటప్పుడు ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోవాలి అని చెప్పింది. ఇంకా బ్రహ్మాజీ ఉన్నంతసేపు సైలెంట్ గా ఉండి అందరినీ ఒక్కసారిగా నవ్విస్తారని అలా నవ్వించడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమని ఓంకార్ చెప్పారు. దీంతో మరోసారి బ్రహ్మాజీ తన హావభావాలతో అలరించాడు.

Anchor Rashmi Bramhaji

రష్మిని ఓంకార్ అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం మరోసారి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. ఒంటరిగా ఐలాండ్ కు వెళ్లాలంటే ఏ టాలీవుడ్ హీరోని తీసుకొని వెళ్తావు అని ఓంకార్ అడిగాడు. దానికి రష్మి సిగ్గుపడుతూ.. మరే హీరో వద్దు సుధీర్ ఉంటే బాగుంటుంది. తన కంపెనీనీ నేను కోరుకుంటాను. తను నాతో ఉంటే బాగుంటుందని చెప్పింది. తాజాగా వచ్చిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది.

- Advertisement -
Rashmi Gautam

అలాగే బ్రహ్మాజీని ఎప్పుడైనా ఏ హీరోయిన్ తో అయినా డేట్ కు వెళ్లారా అని అడగ్గా.. ఆయన ఇప్పటికి చాలా మందితో వెళ్లాను అలా వెళ్లిన వాళ్ల పేర్లు అని చెబితే గొడవలు అవుతాయని చెప్పారు. ఒక వేళ పదివేలు గెలుచుకుంటే ఎలాంటి ప్రశ్నలు ఉంటాయని యాంకర్ రష్మి ఓంకార్ ను అడగ్గా.. వద్దులే ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగాడంటూ బ్రహ్మాజీ తప్పించుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here