యాంకర్ రష్మీ ప్రేమ వ్యవహారం ఆ షో సాక్షిగా బయటపడింది..

- Advertisement -

సెలబ్రిటీల తాలూకు ప్రేమ వ్యవహారాలు జనాల్లో ఎప్పుడూ హాట్ ఇష్యూ అవుతూనే ఉంటాయి. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ రష్మీ- సుడిగాలి సుధీర్ జోడీ. బుల్లితెర రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ పెయిర్‌పై నిత్యం వార్తల ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయ్యారు సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ. జబర్దస్త్ వేదికగా వీరిద్దరి లవ్ ట్రాక్‌పై బోలెడన్ని స్కిట్స్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఎప్పటికప్పుడు ఈ జోడీని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సూపర్ హిట్ పెయిర్ చేసేశారు.

Sudheer-Rashmi

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మి తన ప్రేమను పరోక్షంగా బయటపెట్టింది. తర్వాత ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో రష్మీ నోరు జారింది.అందులో తమ జీవితంలో జరిగే విషయాలు సక్సెస్ అవుతాయా లేదా అని తెలుసుకోవడానికి ఓ లక్ టెస్ట్ పెట్టారు. ఒక పాప్ కార్న్ బాక్స్ పెట్టి అందులో రాళ్లు వెసేలా గేమ్ ఆడారు. పాప్ కార్న్ బాక్స్ లో రాయి పడితే అనుకున్నది జరుగుతుంది. అయితే రష్మి అందులో రాయి వేయగానే పడింది. దీంతో రష్మి ప్రేమ గురించే చెప్పిందంటూ యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఆమెకు సుధీర్ పై ప్రేమ ఉంది కాబట్టే రాయి పడిందంటున్నారు. వీరిద్దరి వ్యవహారం ఇలా బయటపడిందంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.

సుధీర్- రష్మీ మధ్య జబర్దస్త్ లో మొదలైన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఢీ షో వరకు పాకింది. దీనికి తోడు ప్రతి పండగ వేళ రష్మీ సుధీర్ ప్రేమ సంగతులు హైలైట్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే చాలు లవ్ సింబల్స్ దర్శనమిస్తుండటం జనాల్లో అనుమానాలు పెంచేసింది. సుధీర్ కనిపించినప్పుడల్లా యాంకర్ రష్మీ సిగ్గు మొగ్గలేయడం, అలాగే ఆన్ స్క్రీన్ పై బోలెడన్ని సార్లు ఈ జోడీ పెళ్లి కూడా కావడంతో వీళ్ళ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. రష్మీ- సుధీర్ సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నారనే విషయంపై జనంలో ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here