Anchor Anasuya : జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో హాట్ యాంకర్ అనసూయ ఒకరు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని స్టేజిపై అందాలను ఆరబోసే ఆమెను చూడడానికే చాలామంది ఈ షో చూశారంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ షో ద్వారా అనుసూయ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం వరుస సినిమాలు, షోలతో అదరగొడుతోంది. ఇక ఒక స్టేజ్ వచ్చే వరకు ఆ వల్గర్ షోను భరించిన ఆమె.. ఇక దానిని తట్టుకోలేక షో నుంచి బయటకు వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే రంగమ్మత్త అనే చెప్పాలి. అప్పట్లో ఎవరో కుర్రాళ్లు సరదాగా ఆంటీ అని పిలిచినందుకు ఆమె చేసిన రచ్చ అంత ఇతా కాదు. చిన్నపిల్లలు ఆంటీ అంటే ఓకే కానీ, తన వయస్సు ఉన్న వాళ్లు ఆంటీ అని పిలవడం నచ్చలేదంటూ పోలీసుల దాకా వెళ్లింది.
![Anchor Anasuya Anchor Anasuya](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/05/actress-anasuya-bhardwaj-showing-all-her-beauty-while-swimming1716536300_6.jpg)
అలా అలా ఒకటి పోతే ఒకటి ఇక ఆగాయి అనుకున్నప్పడల్లా ఏదో ఒక వివాదంలో ఉంటూ.. మీడియా అటెన్షన్ తనపై పడేలా చేసుకుంటుంది. ఒక సోషల్ మీడియా లో అనసూయ బికినీ ఫోటోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సముద్రపు ఒడ్డున వైట్ బికినీలో అను బేబీ అందాల ఆరబోతను ఏ ఒక్క కుర్రాడు అంత తొందరగా మర్చిపోలేడు. ఇక ఈ ఫొటోస్ పై విమర్శలు, ట్రోల్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఏది ఎలా ఉన్నా తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది అనసూయ. నిత్యం షూటింగ్స్తో బిజీగా ఉండే అనసూయ కాస్త రిలాక్స్ అయింది. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి టూర్ వేసింది. సిక్కింలో అందమైన నదీలోయ ప్రాంతానికి వెళ్లింది. భర్త, పిల్లలతో కలిసి నీటిలో తడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ఆ టూర్కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram