అతడే డబ్బులిచ్చి అలా చేయించాడు.. విజయ్‌ దేవరకొండ వివాదంపై బోరున ఏడ్చిన అనసూయ

- Advertisement -

గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేసుకుంటూ వస్తుంది. ఈ పోస్ట్ లపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇది ఇలా కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది.

విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా అనసూయ ఒకటి రెండు సార్లు పోస్ట్ లు చేసింది. ఇటీవల విజయ్ నటించిన ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. దీని తర్వాత ఈ వివాదం మరింత ముందిరింది. అయితే తాజాగా అనసూయ ఈ కోల్డ్ వార్ పై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విజయ్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది.

‘‘విజయ్‌ దేవరకొండ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’లో అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌ విజిట్‌కు వెళ్లి ఆయన.. అక్కడ ఉన్న అభిమానులతో ఆ పదాలను పలికించారు. ఒక తల్లిగా అది నన్నెంతో బాధించింది. ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ మొదలయ్యాయి.

- Advertisement -

ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన నేను (విజయ్‌ నిర్మించిన చిత్రం) ‘మీకు మాత్రమే చెప్తా’లో నటించాను. విజయ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్‌ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యాను. విజయ్‌కు తెలియకుండానే ఇది జరుగుతోందా? అనిపించింది. విజయ్‌ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదు. కానీ, ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి’’ అని ఆమె చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here