అనసూయకి, విజయ్‌ దేవరకొండకి మధ్య అన్ని జరిగాయా? నిజాలు బయటపెట్టేసిందిగా!

- Advertisement -

బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కి, విజయ్ దేవరకొండకి మధ్య విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండకి సంబంధించిన విషయాలపై అనసూయ ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి ఆయన ఫ్యాన్స్‌ అనసూయపై విపరీతమైన ట్రోల్స్ చేస్తుంటారు. అయితే అనసూయ, విజయ్‌ల మధ్య అంతగా ఏమి జరిగిందన్న దానిపై చాలామందికి క్లారిటీ లేదు.

అనసూయ
అనసూయ

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా విడుదలైనపుడు మెుదటిసారి అనసూయ, విజయ్‌ మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో విజయ్ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్స్ చేస్తూ ఆంటీ అంటూ కామెంట్స్ చేసేవారు. ఇటీవల ఖుషీ సినిమా పోస్టర్‌పై విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ద’ అని పేర్కొనడాన్ని పైత్యంగా అనసూయ అభివర్ణించింది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విభేదాలపై అనసూయ డైరక్ట్‌గా ఎప్పుడూ స్పందించిందిలేదు. రకానీ తొలిసారిగా ఈ అంశాలపై అనసూయ భరద్వాజ్ తన స్పందనను ఓ మీడియా సంస్థతో పంచుకుంది.

Anasuya

‘‘విజయ్, నేను గతంలో స్నేహితులమే. అప్పుడు ఏ సమస్యా లేదు. అర్జున్ రెడ్డి (2017) విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఓ థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని విజయ్‌ను కోరాను’’ అని అనసూయ వివరించింది.

- Advertisement -

ఆ తర్వాత విజయ్ దేవరకొండ తండ్రి 2019లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. ‘విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టాడని, విజయ్‌కి తెలియకుండానే వారు ఇలాంటివి చేయరని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here