నేను నీకు సరైన పెళ్లాన్ని కాదని నాకు తెలుసు.. అనసూయ పోస్ట్

- Advertisement -

యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది అనసూయ (Anasuya Bharadwaj). ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎలాంటి విషయంలో అయినా తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంటుంది. నేడు అనసూయ, సుశాంక్‌ దంపతుల పెళ్లిరోజు. ఈ సందర్భంగా భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఓపెన్ మెసేజ్ పెట్టారు. తనకు తన భర్త రాసిన తొలి ప్రేమలేఖకు అప్పుడు సమాధానం ఇవ్వలేకపోయానని.. ఇప్పుడు దానికి సమాధానంగా ఈ మెసేజ్ పెడుతున్నానని అనసూయ పేర్కొన్నారు.

అనసూయ
అనసూయ

‘‘ప్రియమైన నిక్కూ.. ఇన్నాళ్లూ నాతో కలిసి ఉండటమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు మీపై ఎంతో నీచమైన కామెంట్స్ చేశారు. కానీ, మీరు వాటిని పట్టించుకోలేదు. మన ప్రేమ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిలబెట్టావు. అందుకు నీకు కృతజ్ఞతలు. నన్ను ఎంతో ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటున్నారు. మనం ఎంతో తెలివిగా ముందుకు సాగుతున్నాం. పైకి ఎదుగుతున్నాం. మీరు నన్ను ఇంతగా ప్రేమగా, ఇంత ఒపికగా ఎలా చూసుకుంటున్నారు? అని ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాల్లో నిన్ను వెనుకేసుకున వస్తున్నాను.

ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. కొంత మంది మన జీవితాన్ని చికాకు పెట్టాలని భావిస్తున్నా, పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాం. మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు. కానీ, కష్టసుఖాల్లో తోడుంటూ కలిసిపోతున్నాం. మన మధ్య ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఒకరికొకరం బలంగా ముందుకుసాగుతున్నాం. మన వివాహ బంధాన్ని డేటింగ్ లాగా ఉండేందుకు అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు. హ్యాపీ యానివర్సరీ బేబ్. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ అనసూయ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here