ఆ విలన్ నాగార్జున భార్యను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్నాడా ?

- Advertisement -

అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మన్మథుడిగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా మారిపోయారు నాగార్జున. ఆయన తన భార్య అక్కినేని అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునకు అంతకుముందే లక్ష్మీ అనే మహిళతో వివాహం జరిగింది. తన మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చి కొన్ని రోజులకే అమలను పెళ్లి చేసుకున్నాడు. అమల చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా సెన్సిటివ్. తాను సినిమాల్లో అద్భుతంగా నటించింది. నాగార్జున – అమల మొదటి సినిమాతోనే మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా అఖిల్ జన్మించాడు.

నాగార్జున
నాగార్జున

పెళ్లి అనంతరం అమల సినిమాలకు దూరమైంది. ఇంటికే పరిమితమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే సినిమాల్లో నటిస్తున్నప్పుడు అమలను ఓ నటుడు సినిమాల్లో గాఢంగా ప్రేమించేవాడట. ఈ విషయం అమలకు తెలియదు. ధైర్యం లేక అమలకు చెప్పలేకపోయాడు. అమలకు చెప్పకుండానే వన్ సైడ్ లవ్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. ఆ నటుడు మరెవరో కాదు. ఒకప్పుడు స్టార్ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘువరన్. నాగార్జున కంటే ముందు అమలను గాఢంగా ప్రేమించాడు. కానీ అమలకు చెప్పలేదు. ఆ తర్వాత అమల, నాగార్జున ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న రఘువరన్ అమలను దూరంగా ఉంచాడు. ప్రేమ విఫలం కావడంతో రఘువరన్ మద్యానికి బానిసై సినిమాల్లో నటించకుండా అనారోగ్యంతో చనిపోయాడు. అయితే రఘువరన్ నటి రోహిణిని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here