Allu Arjun : బాలీవుడ్‌ హీరోతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీ స్టారర్..?

- Advertisement -

Allu Arjun : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. నీయమ్మ తగ్గేదేలే’ అంటూ టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్‌లను షేక్ చేశాడు ఐకాన్ స్టార్. ఈ మూవీతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో తెలిసిన సంగతే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.

Allu Arjun
Allu Arjun

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇవి బాక్సాఫీస్‌ను షేక్ ఆడించడమే కాదు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చే నెక్స్ట మూవీ మల్టీ స్టారర్ మూవీఅట. అది కూడా టాలీవుడ్ హీరోతో కాదట. ఏకంగా ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ యంగ్ హీరో నటించబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Trivikram and allu arjun
Trivikram and allu arjun

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మల్టీస్టారర్‌లో బన్నీ పక్కన బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించనున్నాడట. ఈ సినిమాలో బన్నీ, కార్తీక్ స్నేహితులుగా నటించనున్నారట. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామాగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా 2023 సమ్మర్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని టాక్. గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడని.. ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ – త్రివిక్రమ్ – కార్తీక్‌ ఆర్యన్‌ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -
Kartik Aryan and allu arjun
Kartik Aryan and allu arjun

పుష్ప మూవీతో బాలీవుడ్‌లో తనకంటూ మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆ మూవీకి కార్తీక్ ఆర్యన్ తోడవుతుండటంతో ఈ చిత్రానికి బాలీవుడ్‌లో మంచి ఆదరణే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కలిసి ఒకే తెరపై కనిపిస్తే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందోనని ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ద రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.

ఇక కార్తీక్ ఆర్యన్ విషయానికొస్తే.. ఈ హీరో ప్రస్తుతం షెహజాదా అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ఇది బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురము సినిమాకు రీమేక్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక కార్తీక్ ఇటీవలే.. ఫ్రెడ్డీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here