Akkineni Nagarjuna : రజినీకాంత్ 171 సినిమాలో నాగార్జున.. అది ఓకే కానీ మన స్టార్స్ తో ఎప్పుడు సర్‌…?

- Advertisement -

Akkineni Nagarjuna : టాలీవుడ్ కింగ్, మన్మథుడు.. అక్కినేని నాగార్జున ప్రయోగాలకు పెట్టింది పేరు. కొత్త దర్శకులకు లైఫ్ ఇవ్వడంలో కింగ్ ముందుంటాడు. మల్టీస్టారర్లకు కూడా వెనకాడడు. ఇప్పటికే తమిళం, హిందీ హీరోలతో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. ఇక తాజాగా నాగ్ నెక్స్ట్ మల్టీస్టారర్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..?

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్ – లోకేశ్ కనగరాజ్​ కాంబోలో ఓ సినిమా వస్తోంది. ‘తలైవా 171’ వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ లోకేశ్​ ఈ సినిమాను గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. అయితే కథ డిమాండ్ మేరకు సినిమాను మల్టీస్టారర్​గా తెరకెక్కించాలని మేకర్స్​ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సినిమాలో ఇంకో హీరోగా ఎవరిని ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను తీసుకోవాలని టీమ్ భావిస్తోందట. ఇందుకోసం మేకర్స్ నాగ్​తో చర్చలు జరిపినట్లు టాక్. ఒకవేళ ఇది నిజమైతే తమిళ్ తలైవాతో టాలీవుడ్ కింగ్​ను బిగ్ స్క్రీన్​పై చూడవచ్చు.

- Advertisement -

అయితే మల్టీస్టారర్ సినిమాలకు మొదటి నుంచి ఆసక్తిని కనబర్చుతున్న నాగార్జున గతంలో  బ్రహ్మాస్త్ర సినిమా కోసం బాలీవుడ్‌ లో రణబీర్ కపూర్ తో కలిసి నటించాడు. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో కలిసి ‘కుబేర’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే తమిళ స్టార్ హీరోల సినిమాల్లో, హిందీ సినిమాల్లో నటిస్తున్న నాగార్జున ఎప్పుడు టాలీవుడ్ స్టార్‌ హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటాడు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాగ్ సర్ తో మన వాళ్లతో ఎప్పుడు మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్ అంటే అదిరిపోతుంది అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here