ఆశలన్నీ ఆ డైరెక్టర్ పైనే పెట్టుకున్న అఖిల్.. పాపం అంటున్న అభిమానులు

- Advertisement -

వివి వినాయక్..మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆది సినిమాతో దర్శకుడి గా అడుగుపెట్టిన వివి వినాయక్.. ఇక ఆ తర్వాత.. దిల్, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, సాంబ తదితర సినిమాలకి దర్శకుడి గా వ్యవహరించి..మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక దీంతో డైరెక్టర్ గా పేరుపొందారు వివి వినాయక్. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే తమ వారసులు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే అది కేవలం వివి వినాయక వల్ల సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

అఖిల్
అఖిల్

అయితే అలా నాగార్జున కుమారుడైన అఖిల్ ను, బెల్లంకొండ సాయి ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలావుంటే నాగార్జున కుమారుడు అఖిల్ ని లాంచ్ చేస్తున్న సమయంలో అఖిల్ సినిమాని తెరకెక్కించారు. అయితే కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా నిరాశపరిచింది. ఇక ఈ సినిమా సగటు ప్రేక్షకుడనే కాదు అక్కినేని అభిమానులను కూడా అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఇక పరాజయానికి తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నారు వినాయక్.

తాజాగా అఖిల్ హీరోగా వచ్చిన ఏంజెంట్ మూవీ ప్లాప్ అవ్వడంతో మరోసారి వివి వినాయక్ ను ఆశ్రయించాడట అఖిల్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికీ మంచి సక్సెస్ కావాలి. ఈ ఏడాది అఖిల్ నుండి వచ్చిన ‘ఏజెంట్’, వినాయక్ నుండి వచ్చింది ‘ఛత్రపతి‘(హిందీ) అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం అఖిల్ ఓ కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడు. మరోపక్క వినాయక్ తో వర్క్ చేయడానికి కూడా అఖిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కథ – స్క్రీన్ ప్లే ఓ టాప్ రైటర్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. వినాయక్ డైరెక్షన్ మాత్రమే చేస్తారని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here