బాలీవుడ్ బడా డైరెక్టర్ తో రామ్ చరణ్ ‘రామాయణం’..ఈసారి గురి తప్పదు!

- Advertisement -

మన పురాణాలను మరియు ఇతిహాసాలను లేటెస్ట్ టెక్నాలజీ తో అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తే చూడాలనే కోరిక ప్రతీ ఒక్కరి లోనూ ఉంటుంది. అందుకే రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం కోసం ప్రేక్షకులు విడుదలకు ముందు అంతలా ఎదురు చూసారు.అయితే కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం తో అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా నిరాశకి గురయ్యారు.

 రామ్ చరణ్
రామ్ చరణ్

అసలు రామాయణం ని చూస్తున్నట్టే లేదని కామెంట్స్ చేసారు. గ్రాఫిక్స్ పరంగా కూడా ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరిచారు. రామాయణం ని ఇంత ఖూనీ చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎవరూ చెయ్యలేదని, ఎదో బొమ్మల సినిమాని చూసినట్టుగా అనిపించింది అంటూ కామెంట్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్ల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుల చేతికి వెళ్తే ఇలాగే తీస్తారు అంటూ విశ్లేషకులు పెదవి విరిచారు.

adipurush

అయితే ఇప్పుడు రామాయణం ని మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడట. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీ రాముడిగా నటిస్తాడని , అలాగే సీత గా సాయి పల్లవి నటిస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ మరెవరో కాదు, సంజయ్ లీల భన్సాలీ. ఈయన డైరెక్షన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. డ్రామా మరియు ఎమోషన్స్ ని తన సినిమాల్లో మిస్ కాకుండా చూసుకుంటాడు ఈ డైరెక్టర్.

- Advertisement -
ram charan

ఇతని దర్శకత్వం లో వచ్చిన ‘పద్మావతి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరూ చూసారు.ఆయన చాలా కాలం క్రితమే రామ్ చరణ్ తో రామాయణం తియ్యాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇద్దరు తమతమ వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉండడం తో కుదర్లేదు. ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం అయిపోయిందని, ఈ ఏడాది లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభం లో కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here