నాగార్జున ఆ హీరోయిన్లను ఎందుకు ఎక్కువగా రిపీట్ చేసేవారు..?

- Advertisement -

నాగార్జున గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పటినుండో ఇండస్ట్రీలో నాగార్జున నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది హృదయాలని గెలుచుకున్నారు అక్కినేని నాగార్జున. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ సుపరిచితమే. నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. తండ్రి బాటలో కాకుండా తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్నారు. నాగార్జున నటించిన శివ గీతాంజలి అన్నమయ్య సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ మూవీస్ అప్పట్లో నిజానికి పెను సంచలనాన్ని సృష్టించాయని చెప్పొచ్చు. ఏ జోనర్ లో అయినా సినిమాలు చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటల్లో నాగార్జున ఒకరు. ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నాగార్జున ఒకప్పుడు సౌందర్య రమ్యకృష్ణ వంటి హీరోలతో ఎక్కువగా నటించేవారు మీనా రంభ వంటి అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా ఎక్కువగా రిపీట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

- Advertisement -

సౌందర్య రమ్యకృష్ణతో మాత్రం ఎక్కువగా మూవీస్ చేశారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున ఈ విషయం గురించి చెప్పారు. నాతో సినిమా చేసే దర్శకులు సౌందర్య రమ్యకృష్ణ పేర్లను ఎక్కువగా ప్రస్తావించేవారు. అందుకనే వాళ్లతోనే సినిమాలు ఎక్కువగా చేశాను. కెమిస్ట్రీ కూడా అప్పట్లో బాగా వర్కౌట్ అయిందని ఆ ఉద్దేశంతోనే దర్శకులు ఆ హీరోయిన్లని కోరేవారట. అలా వాళ్లతో నటించేవాడినని సూపర్ డూపర్ సక్సెస్ అవడం ప్రేక్షకులకి బాగా తెలుసు అని నాగార్జున అన్నారు. హీరోయిన్ టబు తో కూడా వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద అవి సూపర్ హిట్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here