Ashu Reddy : వేణు స్వామి చెప్పినట్లే చేస్తున్న అషు రెడ్డి.. మరోసారి పూజలు చేయించుకుంది..

- Advertisement -

Ashu Reddy : సినీ సెలెబ్రిటీల జాతకాలు చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సుపరిచిత వ్యక్తిగా మారిపోయారు వేణు స్వామి. ఆయన చెప్పినవి చెప్పినట్లు నూటికి 90 శాతం జరుగుతున్నాయి. దీంతో ఆయన చెప్పే జాతకాలపై జనాలతో పాటు సెలెబ్రిటీలకు కూడా నమ్మకం ఏర్పడింది. ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు లేదా రాకుండా ఉండటానికి వేణు స్వామిని ఆశ్రయిస్తున్నారు.

Ashu Reddy
Ashu Reddy

ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. చిన్న చిన్న నటుల దగ్గరినుంచి స్టార్‌లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. ఎక్కువగా హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడీ వరుసలోకి ప్రముఖ నటి అషురెడ్డి చేరిపోయారు. తాజాగా, ఆమె వేణుస్వామితో ఇంట్లో పూజలు చేయించారు. ఆమె పూజలు చేయించిన కారణం కొత్త కారు కొనటం. అవును ఆమె తన కొత్త కారుకు పూజలు చేయించారు.

Venu Swamy

కొద్దిరోజుల క్రితం అషురెడ్డి రేంజ్‌ రోవర్‌ వైట్‌ కారును కొన్నారు. ఆ కారుకు పూజలు చేయించటానికి వేణు స్వామిని ఇంటికి పిలిపించారు. కారుకు పూజలు చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, అషురెడ్డి గతంలో బెంజ్‌ కారు కొనుగోలు చేశారు. ఆ కారును తన తండ్రి బర్త్‌డేకు కానుకగా ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here