Varun Tej : ఒక్కటైన వరుణ్ తేజ్-లావణ్య.. ముందు ఎవరి ఆశీర్వాదం తీసుకున్నారో తెలుసా..!

- Advertisement -

Varun Tej : ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ రోజు రాత్రి 7.18 గంటలకు… శుభ ముహూర్తాన లావణ్య శిరస్సు మీద వరుణ్ తేజ్ జీలకర్ర బెల్లం పెట్టారు. మెడలో మూడు ముడులు వేసి ఏడు అడుగులు నడిచారు. లావణ్యా త్రిపాఠి తల్లిదండ్రులు డియో రాజ్, కిరణ్ త్రిపాఠి కన్యాదానం చేశారు.

varun lav
varun lav

కొత్త జంట ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని జీవితం ప్రారంభించారు. పెళ్లి తర్వాత అక్కడే రిసెప్షన్ కూడా మొదలైంది. వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి సుమారు 120 మంది అతిథులు హాజరైనట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు & అల్లు అర్జున్ స్నేహా రెడ్డి దంపతులు ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక… మెగా కజిన్స్ అందరూ అటెండ్ అయ్యారు. పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట హైదరాబాద్ వస్తారు. వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here