Varalakshmi Sarathkumar : చెంప పగులుద్ది అంటూ సురేష్ కొండేటి కి వార్నింగ్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్!

- Advertisement -

Varalakshmi Sarathkumar : సీలెబ్రిటీస్ కి చాలా చిరాకు కలిగించే ప్రశ్నలు అడిగే విలేఖరులలో ఒకడు సురేష్ కొండేటి. ఇప్పటి వరకు ఇతని పై ఎంతో మంది సెలెబ్రిటీలు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంతమంది ఎన్ని తిట్టినా కూడా ఈయన తన స్టైల్ ని మార్చుకోడు. రీసెంట్ గా ఆయన తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా చిరాకు తెప్పించేసాడు.

Varalakshmi Sarathkumar
Varalakshmi Sarathkumar

విషయం ఏమిటంటే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘మ్యాన్షన్ 24 ‘ అనే వెబ్ సిరీస్ నేడే డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమెతో పాటుగా సత్యరాజ్ మరియు అవికా గోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mansion 24

ఈ సిరీస్ నేడు విడుదలైన సందర్భంగా ఓంకార్ మూవీ టీం మొత్తం తో కలిసి ఒక విలేఖరుల సమావేశం ని ఏర్పాటు చేసాడు. ఈ సమావేశం లో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పాల్గొనింది. ఆమెని సురేష్ కొండేటి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు దేవుడు , దెయ్యం మీద నమ్మకం ఉందా’ అని అడుగుతాడు. అప్పుడు వరలక్ష్మి ‘అవును, దేవుడు మరియు దెయ్యాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను’ అని సమాధానం చెప్తుంది.

- Advertisement -

‘మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతారు, దేవుడినా, లేదా దెయ్యం నా ‘ అని అడుగుతాడు సురేష్ కొండేటి. అప్పుడు వరలక్ష్మి ‘ఇదేమి దిక్కుమాలిన ప్రశ్న?, అందరూ ఇష్టపడేది ఎవర్ని?, మీరు దెయ్యాలను ఇష్టపడుతున్నారా? ‘ అని అడుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడిగితే చెంప పగులుద్ది అనే రేంజ్ లో ఆమె సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here