కన్న తండ్రే నన్ను చంపేస్తానన్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్ మూడో భార్య

- Advertisement -

ఎప్పుడో ఇరవైనాలుగేళ్ల క్రితం కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వనితా విజయ్ కుమార్. సౌత్ సీనియర్ నటుడు విజయ్ కుమార్.. మంజుల పెద్ద కూతురు వనిత. కెరీర్‌ బిగెనింగ్‌లో వరుస సినిమాలు చేసి.. పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయ్యింది. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా గడిపిన వనితా.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమె మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 వనితా విజయ్ కుమార్
వనితా విజయ్ కుమార్

ఒకానొక సమయంలో కుటుంబసభ్యులే తనని బెదిరించారని, మానసిక వేధింపులకు గురి చేశారని నటి వనితా విజయ్‌ కుమార్‌ తెలిపారు. కుటుంబసభ్యులు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక సుమారు రెండేళ్లపాటు కర్ణాటకలోని మైసూర్‌లో తలదాచుకున్నానని ఆమె చెప్పారు. ‘మళ్ళీ పెళ్లి’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

గతంలో నేను ఆస్తి తగాదాలు ఎదుర్కొన్నాను. అప్పుడు సొంత వాళ్లే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. పోలీసులు నన్ను కొట్టారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. నా కుటుంబం నుంచే బెదిరింపులు వచ్చాయి. పిల్లలను తీసుకుని తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్లిపోయాను. మైసూర్‌లో సుమారు రెండేళ్లు ఉన్నాను. ఆ సమయంలో మా నాన్నకు ఫోన్‌ చేశాను. ‘‘ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మ ఉంటే ఇలా జరగనిచ్చేదా?’’ అని ప్రశ్నించాను. దానికి ఆయన.. ‘‘తమిళనాడు నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒక్కసారి వచ్చి చూడు’’ అని ఛాలెంజ్‌ చేశారు. కానీ, ఇప్పుడు తమిళనాడులో అందరూ నన్ను తమ ఇంటి బిడ్డగా భావిస్తున్నారు. అని వనితా విజయ్‌కుమార్‌ వివరించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here