బాక్స్ ఆఫీస్ ఊచకోతకు సిద్దమైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు

- Advertisement -

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. సుమారు 15 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరిగింది,ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా ఈమధ్యనే ప్రారంభించాడు డైరెక్టర్ హరీష్ శంకర్.అప్పుడే ఎడిటింగ్ వర్క్ ఎందుకు అని అందరూ అనుకున్నారు.

కానీ ఆ ఎడిటింగ్ వర్క్ ని ఎందుకు ప్రారంభించారో ఈరోజు అర్థం అయ్యింది. మే 11 వ తారీఖున ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా అభిమానుల్లో మరింత ఊపు రప్పించేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ కాసేపటి క్రితమే ట్విటర్ లో అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రకటన కోసం ఫ్యాన్స్ గత వారం రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా లో గ్లిమ్స్ వస్తుంది అనే వార్త వారం రోజుల క్రితమే తెలుసు కానీ, అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.అసలు గ్లిమ్స్ విడుదల చేస్తారా లేదా అనే సందేహం లో కూడా ఉన్నారు ఫ్యాన్స్, అలాంటి సమయం లో మైత్రీ మూవీ మేకర్స్ గ్లిమ్స్ ఉంది అని చెప్పడం తో ఫ్యాన్స్ అనందం కి హద్దు అదుపు లేకుండా పోయింది.

- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ చేత ప్రత్యేకంగా ఈ ప్రకటన ని చేయించారు మేకర్స్.ఈ గ్లిమ్స్ వీడియో లో మొదటి షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ బ్లాక్స్ తో పాటుగా, ఒక పవర్ ఫుల్ డైలాగ్ పవన్ కళ్యాణ్ మార్కులో ఉండే విధంగా వీడియో ని కట్ చేశారట.ఈ వీడియో తో మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here