Nikita Thukral : సినిమా అనే4ది రంగుల ప్రపంచం. రోజురోజుకు ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. అంతేకాకుండా ఎవరి కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కొందరు ఒక్క సినిమాతోనే స్టార్ గా ఎదిగి వరుస అవకాశాలతో దూసుకుపోతుంటారు. మరి కొందరు సక్సెసులు వచ్చినా ఆఫర్లు లేక అవస్థలు పడుతుంటారు. ఎంత కష్టపడినా గుర్తింపు రాక కొందరు ఇబ్బంది పడుతుంటారు.. వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడంలో కొందరు ఫెయిల్ అవుతుంటారు. ఇక పర్సనల్ లైఫ్లో చేసిన పొరపాట్లు, తప్పుల కారణంగా కెరీర్ను నాశనం చేసుకున్న సెలబ్రిటీలు లేకపోలేదు. అలాంటి వారిలో నిఖితా తుక్రాల్ కూడా ఒకరు.
నికితా ముంబయి నుండి తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇక్కడ ఓ వెలుగు వెలిగి.. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.. తన కుమారుడు ఆర్యన్ రాజేశ్ను హీరోగా పరిచయం చేస్తూ హాయ్ అని మూవీని తెరకెక్కించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది. కన్నడ ఇండస్ట్రీపై ఇష్టంతో అక్కడే పాగా వేసేందుకు ప్రయత్నించింది. మెల్లిగా తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. ఆ సమయంలో ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె వెండితెరకు కనుమరుగైంది. ఆమె కెరీర్ పీక్స్లో ఉండగా ఈ అమ్మడు అప్పటికే పెళ్లైన ఒక కో- యాక్టర్ దర్శన్తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం అతని భార్య విజయ లక్ష్మికి తెలియడంతో వివాదాలు మొదలయ్యాయి.
సినీ నిర్మాతల సంఘం నిఖితను సినిమా అవకాశాలు ఇవ్వకుండా మూడేళ్ల పాటు నిషేధించింది. దీంతోపాటు ఇండస్ట్రీలో అనేక అవమానాలు ఆమెకు తారస పడ్డాయి. అభిమానుల్లో కూడా ఆమె గౌరవం తగ్గిపోయింది. ఈ కారణంగా కెరీర్ నాశనం అయి, సినిమాలకు దూరం అయింది. నిఖితా మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే సాహసం చేయలేదు. 2017లో ప్రముఖ వ్యాపార వేత్త గగన్ దీప్ సింగ్ మాగోను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓ కూతురికి తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు, అనసూయ, భద్రాద్రితో పాటు అవును 2, టెర్రర్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే చింతకాయల రవిలో పూజ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తోంది.