పది గంటలు సర్జరీ.. నటి రోహిణి కాలులోంచి రాడ్ బయటకు తీసిన డాక్టర్లు.. యాక్టింగ్ కు గుడ్ బై చెప్పనుందా?

- Advertisement -

యాక్టర్, జబర్దస్త్ కమెడియన్ రోహిణి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే.. కాలుకు సర్జె్రీ కావడంతో ఆసుపత్రిలో ఉంది.. అయితే ఈమెకు గతంలో యాక్సిడెంట్ అవ్వడంతో కాలు విరిగింది.. అది సీరియస్ కావడంతో కాలులో రాడ్డు వేసినట్లు తెలిపింది.. అయితే ఇప్పుడు రాడ్డు తీసేయించాలని ఆసుపత్రికి వెళ్ళింది.. గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉంది.. సర్జరీ కోసం వెళితే డాక్టర్లు రాడ్డు తియ్యలేమని చెప్పడంతో తనకు ముందు ఆపేరేషన్ చేసిన ఆసుపత్రికే వెళ్లి రాడ్డు తీయించుకుంది.. దాదాపు పది గంటలు కష్టపడి ఆ రాడ్డును తీయించినట్లు రోహిణి తన ఛానెల్ ద్వారా తెలిపింది.. ఆ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

రోహిణి
రోహిణి

రోహిణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సీరియల్స్ తో బాగా ఫెమస్ అయ్యింది.. ఆ తర్వాత పలు షో లలో మెరిసింది.. అలా పాపులరీటిని సంపాదించుకుంది.. బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక రోహిణికి దాదాపు ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగిందట. అప్పుడు విశాఖపట్నంలో డాక్టర్ శ్రీధర్.. కుడి కాలిలో రాడ్ వేశాడట. కొంతకాలం తరవాత ఆ రాడ్ తీసేయాలని, కానీ కెరీర్‌లో బిజీగా ఉండటంతో ఖాళీ సమయం దొరకక రోహిణికి కాలిలో ఉన్న రాడ్ తీయించుకోవడం కుదర్లేదట. ఇన్నేళ్లకు కాస్త సమయం దొరకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లిందట. అక్కడ మొత్తానికి సర్జరీ చేయించుకుందట. ఇప్పుడు ఆమె పూర్తిగా క్షేమంగానే ఉన్నారట. కాకపోతే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని రోహిణి చెప్పింది..

విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో తనకి సర్జరీ జరిగిందని రోహిణి చెప్పుకొచ్చింది. రాడ్‌ను తొలగించడానికి డాక్టర్లు చాలా శ్రమించారని తెలిపింది. సర్జరీకి దాదాపు పది గంటల సమయం పట్టిందని రోహిణి పేర్కొంది. ఆరు వారాలపాటు కాలును కిద్ద పెట్టకూడదు, దాని మీద బరువు పెట్టకూడదని వైద్యులు సూచించారట. తాను పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి ఐదు నెలలు పడుతుందని రోహిణి చెప్పుకొచ్చింది.. అప్పటివరకు సినిమాలకు గుడ్ బై చెప్పాననుందని వార్తలు వినిపిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here