Actress : కాల్ గర్ల్ గా మారిన స్టార్ హీరోయిన్.. మరీ ఇంతకు దిగజారాలా అంటున్న ఫ్యాన్స్

- Advertisement -

Actress : నటించింది కొద్ది సినిమాలే అయినా భారీ సంఖ్యలో పాపులారిటీ సంపాదించుకుంది శోభితా ధూళిపాళ. మన తెనాలి అమ్మాయి, తెలుగు హీరోయిన్‌గా అడవి శేషు సరసన గుఢాచారి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో శోభిత ధూళిపాళ ఒకరు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఈ చిన్నది తన కెరీర్‌ను బిజీగా మార్చుకునే పనిలో పడింది.

వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుని కెరీర్లో నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ సినిమాలో శోభిత ధూళిపాళ వేశ్య పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. తాజాగా ఈ సినిమాలో తన పాత్రపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల శోభిత మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో వేశ్యగా నటించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత, కాల్ గర్ల్‌గా నటించడంపై తన ఫీలింగ్స్ వెల్లడించింది. మంకీ మ్యాన్ ఏప్రిల్ 5న యూఎస్‌ఏలో విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేను సీత అనే వేశ్య పాత్రలో నటించాను. ఈ పాత్ర చేయడం నాకు చాలా గర్వంగా అనిపించిందని చెప్పింది. మూవీలో నా పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్ 26న ఇండియాలో కూడా విడుదల చేయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారు. నా పాత్ర మీకు కూడా నచ్చుతుందని నాకు నమ్మకం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక ఈ అమ్మడు 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పేరు వినిపించింది. శోభితాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట ఎప్పుడూ తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నటికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here