మరోసారి నాగార్జున హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్కులు ఆడించి తనదైన పంచులతో ఆకట్టుకున్నారు. ఇక నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ చూస్తూ ఏ గ్లామరస్ బాయ్, తేజ కుర్తా లో భలే ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత అరె యావర్ నువ్వు కూడా అదిరిపోయావు’ అని చెబుతాడు. ఆ తర్వాత చిట్టి ప్రశ్న అనే ఆటను ఆడబోతున్నామని చెబుతూ అన్న మల్లొచ్చినా రా! అనే డైలాగ్ తో ప్రశాంత్ ని ముందుగా పిలుస్తాడు.

ఆ తర్వాత ‘ఈ హౌస్ లో కలుపు మొక్క ఎవరని’ శివాజీని అడుగుతారు నాగార్జున. దానికి శివాజీ బదిలీస్తూ..” చాలామంది ఉన్నారండి” అని చెబుతున్న సమయంలో తేజ, “సార్ నేను ఆ చివరన కూర్చుంటానండి. వచ్చిన వాళ్ళందరూ నా వైపే చూస్తున్నారు సార్” అని చెప్పగానే శివాజీ, తేజ కలుపు మొక్కా అని చెప్తాడు. దాంతో తేజ షాక్ అయి సరదాగా చూసావ్ అనుకున్నా అన్నా, అని శివాజీ తో తేజ అంటాడు. “తేజ కి డిస్కషన్ ఎక్కువ అని శివాజీ చెప్తే, నిజమేనా అని నాకు ప్రశ్నిస్తారు.

దానికి నాకు తెలియదు సార్, ఇప్పుడే తెలిసింది” అని తేజ బదులిస్తాడు. ఆ తర్వాత ఈ “హౌస్ లో తేనె పూసిన కత్తి ఎవరు? అని నాకు అడగగా..” అది నేనే అనుకుంటున్నాను సార్ అని దామిని” చెబుతుంది. దానికి నాగర్జున, “ఇది సేఫ్ గేమ్ కదమ్మా” అని అంటారు. ఆ తర్వాత రతిక వచ్చి ముళ్ళు తిప్పుతుంది. అప్పుడు”రతిక నీకైతే ఏదో రెండు కలర్స్ మధ్య కన్ఫ్యూజన్ లాగా ఉంది” అని నాగార్జున చెప్పగానే అందరూ నవ్వేశారు.” ఇంట్లో ఎవరికీ పని తక్కువ, తిండి ఎక్కువ? అని టేస్టీ తేజని అడిగితే తేజ, రతిగా అని బదిలిస్తాడు. “సాయంత్రం 7:30గం కు మొదలెడితే 10:30గం దాకా ఆపదు సర్ తింటూనే ఉంటుంది” అని అంటాడు.’ ఆవిడకి తినిపిస్తున్నారు కాబట్టి తింటుంది’ అని నాగార్జున పంచ్ వేస్తారు. అలా ఆ టాస్క్ చాలా సరదాగా సాగింది.